1893లో థామస్ ఎడిసన్ 'కినటోస్కోప్' అనే యంత్రాన్ని కనిపెట్టాడు. దానికుండే రంధ్రం గుండా ఒక వ్యక్తి మాత్రమే చిత్రాన్ని చూడగలడు. ఒకేసారి ఎక్కువమంది చూసే వీలు కుదిరేది కాదు. ఆ చిత్రాలు పిల్లల ఈతపందాలు, గుర్రపు పందాలు వంటివి. ఇవి ఒక నిమిషం నిడివి ఉన్నవి మాత్రమే. 1903లో ఎడిసన్ ప్రయోగశాలలో ప్రపంచంలోనే ప్రథమ చలనచిత్రం నిర్మించారు. అదే 'ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ'. ఈ చిత్ర ప్రదర్శనపెద్ద సంచలనాన్ని సృష్టించింది. అమెరికాలోని పిట్స్బర్గ్లో మొదటి చిత్ర ప్రదర్శనశాలను నిర్మించారు. అయితే ఆ రోజుల్లో చలన చిత్రాలకు శబ్దం ఉండేది కాదు.