హయ్ నేస్తాలూ..! గ్రామాల్లోనైనా, నగరాల్లోనైనా గ్రంథాలయాలన్నీ పాతభవనాల్లోనే ఉంటాయి. ఎలా ఉన్నా కానీ కాసేపు హాయిగా పుస్తకాలు, వార్త పేపర్లు చదువుకుందామనే గ్రంథాలయానికి వెళతాం. మరి గ్రంథాలయం ఇంద్రభవనంలా ఉంటే... ఇక చెప్పేదేముంది.. అందరూ క్యూ కట్టేస్తారు. మరి ఆ లైబ్రరీ గురించి తెలుసుకుందామా...
- చెక్రిపబ్లిక్ దేశంలోని ప్రేగ్ నగరంలో ఉన్న 'క్లెమెంటియం' గ్రంథాలయం రాజభవనాన్ని తలపిస్తుంది. పుస్తకప్రియులు, సాహిత్యాభిమానులే కాదు సామాన్య జనం కూడా ఆ గ్రంథాలయాన్ని చూసేందుకు వస్తుంటారు. ఎందుకంటే అది ప్రపంచంలోనే అందమైన గ్రంథాలయం.
- ఇక ఆ గ్రంథాలయానికి వచ్చిన వాళ్లంతా భవన అందాలను చూస్తూ ఉండిపోతారు. గ్రంథాలయంలోని గోడలపై ఉన్న అందమైన కళారూపాలు అందరినీ ఆకట్టుకుంటాయి. పైకప్పు కూడా పెయింటిగ్స్తో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రీకు కథల ఆధారంగా ఈ చిత్రాలను గీశారు. దీన్ని ఫ్రెస్కో పెయింటింగ్ అంటారు. వీటిని 'జాన్ హిబ్ల్' అనే చిత్రకారుడు చిత్రించాడు. పుస్తకాల అరలు ఎంతో చూడ ముచ్చటగా ఉంటాయి. గ్రంథాలయంలో ఎటూ చూసినా ఆకట్టుకునే కళాఖండాలే దర్శనమిస్తాయి.
- జీసుట్ విశ్వవిద్యాలయ నిర్మాణంలో భాగంగా ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1722 లో ప్రారంభించారు. బరోఖ్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవన సముదాయ విస్తీర్ణం దాదాపు అయిదు ఎకరాలు.
- చెక్ రిపబ్లిక్కు సంబంధించిన వివిధ సాహిత్య పుస్తకాలు, ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు వందల ఏండ్ల నాటి చారిత్రక పుస్తకాలను, గ్రంథాలను ఇక్కడ భద్రపరిచారు. ఈ గ్రంథాలయంలో దాదాపు 20,000 పుస్తకాలు ఉన్నాయి. విదేశీ సాహిత్య పుస్తకాలతో పాటు, అరుదైన పుస్తకాలనూ ఇక్కడ చదవచ్చు.
Authorization