ప్రపంచంలో మనిషి నిర్మించిన రెండు ప్రధాన నీటి మార్గాలు పనామా, సూయజ్ కాలువలు. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే దగ్గర మార్గంగా పనామా కాలువను పేర్కొంటారు. అమెరికా తూర్పు, పశ్చిమ తీరాల మధ్య వెళ్లే ఓడలకు తమ ప్రయాణం సుమారు 8 వేల నాటికల్ మైళ్ల దూరం ఈ పనామా కాలువ ద్వారా తగ్గుతుంది. పనామా నిర్మాణ ఆలోచన 16వ శతాబ్దం నాటిది. కానీ పనామా కెనాల్ కంపెనీ అది నిర్మించడంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంది. చివరికి 1904లో పనామా కాలువ పనులు పూర్తయి 1914 ఆగస్టులో రవాణాకు వీలుకలిగింది. అప్పటినుంచి దానికి అనేక అదనపపు పనులు జరుగుతూనే ఉన్నాయి. పనామా కాలువ పొడవు సుమారు 82 కిలోమీటర్లు. 1999 డిసెంబర్ 31న నియంత్రణ బాధ్యతను అమెరికా నుంచి పనామా కంపెనీ అందుకుంది.