మొఘల్ పాలకులు భారతదేశంలో అనేక ఉద్యానవనాలను ఏర్పాటు చేసారు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్కి ఉద్యానవనాలంటే చాలా మక్కువ. భారతదేశంలో మొదటి మొఘల్ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది బాబరే. రామ్బాగ్ పేరిట ప్రసిద్ధి చెందిన ఆగ్రా గార్డెన్ మొదటి మొఘల్ ఉద్యానవనం. మొఘల్ ఉద్యానవనాల నిర్మాణంపై పర్షియన్ ఉద్యానవనాల ప్రభావం ఉండేది. అక్బర్ కూడా ఉద్యానవనాల విషయంలో చాలా శ్రద్ధ కనబరిచాడు. అక్బర్ ఆగ్రాకోట, ఫతేపూర్ సిక్రీలలోకూడా ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. జహంగీర్ పాలనా కాలంలో ఉద్యానవనాల నిర్మాణం మరింత అభివృద్ధి చెందింది. కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్న షాలిమార్ గార్డెన్స్ చాలా అందమైనవి. జహంగీర్ ప్రారంభించిన ఇతర ఉద్యానవనాలు చెప్పుకోదగినవి. షాజహాన్ లాహోర్ షాలిమార్ ఉద్యానవనాలను, ఆగ్రా అంగూరీ బాగ్లను ఏర్పాటు చేసాడు.