ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో అక్వేరియంలో చేపలను పెంచడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అయితే మన ఇంటిలో అలా అక్వేరియం ఉన్నప్పుడు వాటి నిర్వహణ గురించి కాస్తంత అయినా అవగాహన ఉండాలి. లేకపోతే చేపలు చచ్చిపోతాయి. ఉదాహరణకు కొందరు అక్వేరియంలలో నీళ్లను తొందరగా మారుస్తుంటారు. అలా తొందరగా మార్చడం వల్ల కొత్తనీళ్లలో చేపలు సర్దుకునేందుకు సమయం పడుతుంది. పైగా ఒక్కసారిగా నీళ్లు మారిస్తే, నీళ్లలోని రసాయనికి తత్వాల కొరత ఏర్పడుతుంది. అక్వేరియంకు లాభం కలిగించే జీవాణువులు తొలగిపోతాయి. నీళ్లలో చేపలు తినగా మిగిలిపోయిన వ్యర్థపదార్థాలు, కుళ్లిపోయిన ఆకులు మొదలైనవి పేరుకుపోతాయి. అవి చేపలకు అవసరమైనవి. అవి తొలగిపోవడం వల్ల కూడా చేపలకు నీటిలోని సహజ వాతావరణం ఏర్పడదు. అలాగని నెలల తరబడి మార్చకుండా ఉండకూడదు. అక్వేరియంలో ఎప్పుడు నీళ్లు తీసివేసినా లేదా కొత్తనీళ్లు పోసినా పూర్తిగా మార్చకూడదు. కొన్ని నీళ్లు అంటే కనీసం పావు వంతు నీళ్లు అలాగే ఉంచాలి. మిగిలిన ఖాళీలో కొత్తనీళ్లు పోయాలి.