మనల్ని కుట్టే దోమలన్నీ ఆడదోమలే. అవి మన రక్తాన్నే ఆహారంగా ఉపయోగించుకుంటాయి. అంటే ఈ ఆడ దోమలు మనుషుల ఉనికిని తమ దృష్టి, వాసనల ద్వారా గుర్తిస్తాయి. వాటి తలపై ఉండే 'ఏంటెనాలు' వాసన ద్వారా గుర్తించే 72 రకాల గ్రాహకాల్ని కలిగి ఉంటాయి. ఇందులో 27 గ్రాహకాలు మన శరీరంపైఉండే చెమటలోని రసాయనాల్ని పసిగడుతాయి. ఈ రసాయనాల్లో ఇవి గుర్తించగలిగేవి ఏమిటంటే కార్బన్ డై ఆక్సైడ్, అక్టెనాల్, నోనెలాల్లు. ఎవరి చెమటలో వీటి గాఢత ఎక్కువగా ఉంటుందో వారి వైపు ఇవి ఎక్కువగా చేరిపోతాయి. వారిని కుట్టి రక్తాన్ని పీల్చుకుంటాయి.