ఈ భూప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. కొన్ని ప్రకృతి సహజమైతే మరికొన్ని...మనుషులు తమ మేధస్సుతో ఏర్పరిచినవి. అలానే ఈ అందమైన కొండ ప్రకృతి సిద్ధంగా ఏర్పడితే... దీనిపైకి చేరుకోవడానికి మెట్లు కట్టి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు ఇంజినీర్లు. అయితే ఈ మెట్లు ఎక్కాలంటే మాత్రం ధైర్యంతో పాటు ఎంతో శక్తి కావాలట. ఇంతకీ ఆ మెట్లు ఎందుకు నిర్మించారు? అవి ఎక్కడున్నాయి? ఆ విశేషాలు తెలుసుకుందాం....
అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో హావారు రాష్ట్రం కూడా ఒకటి. హావారులోని ఓహు ప్రాంతంలో కొన్ని వేల మెట్లు ఉన్నాయి. వాటినే 'హైకు సెయిర్స్' అంటారు. ఈ మెట్ల దారిలో... ఎన్నో అందమైన దశ్యాలు మనసును హత్తుకుంటాయి.
ప్రశాంతమైన వాతావరణం, వచ్చిపోయే చల్లని గాలులు, పచ్చని చీర కట్టుకున్న ప్రకతి... మనసుకు ఆహ్లాదాన్నిచ్చే పక్షుల కువకువలు.. ఇలా ఇది ఎంత అందమైన ప్రాంతమో అంతకన్న ప్రమాదకరమైన ప్రదేశం కూడా. సముద్రతలం నుంచి దాదాపు 3,000 అడుగుల ఎత్తులో ఈ మెట్లు ఉన్నాయి. మొత్తం 3,992 మెట్లున్నాయి. వీటిని ఎక్కడం చాలా సాహసమే. కొన్ని వందల మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. చుట్టూ భయంకరమైన అటవీ ప్రాంతం. పట్టు తప్పి పడిపోతే ఇక అంతే సంగతులు.
హైకు మెట్లను రెండో ప్రపంచయుద్ధ సమయంలో నిర్మించారు. ఇవి కొండ ప్రాంతంలో ఉన్నాయి. అమెరికా నావిక సిబ్బంది ఈ కొండపైనే హైకు అనే రేడియో స్టేషన్ను రహస్యంగా ప్రారంభించింది. రేడియో స్టేషన్కు రాకపోకలు సాగించడం కోసం ఈ మెట్లను వారు నిర్మించారు. రేడియో సిగల్స్ సరిగా ఉండటం కోసం రేడియో యాంటెన్నాను అంత ఎత్తులో ఏర్పాటు చేశారు. మొదట అక్కడికి వెళ్లడానికి నిచ్చెనలు ఉండేవి. వాటిని 'సిసి క్లైంబ్' అనేవారు. కొండపైకి త్వరగా చేరుకోవడం కోసం ఆ తర్వాత చెక్కతో మెట్లను నిర్మించారు. రేడియో స్టేషన్ స్థానంలో 'ఓమెగా నావిగేషన్ సిస్టిమ్స్ స్టేషన్'ను నేవీ సిబ్బంది 1950 సంవత్సరంలో ప్రారంభించింది. అలానే చెక్కతో నిర్మించిన మెట్లను తీసివేసి ఉక్కుతో మెట్లను నిర్మించారు. అయితే ఈ మెట్లు ప్రమాదకరంగా ఉండటంతో 1987 సంవత్సరం నుంచి ఆ ప్రాంతానికి ప్రజల్ని అనుమతించకుండా ప్రభుత్వం నిషేధం విధించింది.
2003 సంవత్సరం వరకు ఈ మెట్లు పాడైన ప్రతిసారి బాగు చేసేవారు. వీటిని రిపేర్ చేయడం కోసమే దాదాపు 5 కోట్లు ఖర్చు చేసేవారు. ప్రమాదకరంగా ఉండటంతో సందర్శకులు ఈ మెట్లు ఎక్కడాన్ని ప్రస్తుతం నిషేధించారు.
ఈ మెట్ల దారిలో కనిపించే ఎన్నో అందమైన దశ్యాల్ని ఫొటోలు తీయడం కోసమే చాలా మంది సాహిసికులు ఈ మెట్లు ఎక్కుతారు. ప్రధానంగా సూర్యుడు అస్తమించే సమయంలో కనిపించే అద్భుతమైన దశ్యాల్ని తమ కెమెరాలో బంధించడం కోసమే ప్రకతి ప్రేమికులు, సాహిసికులు ఈ మెట్లను ఎక్కుతారు. ఉదయం వేళల్లో ఈ దారిలో దట్టమైన పొగమంచు కమ్మేసి ఉంటుంది. చీకటి పడితే ఈ మెట్లు సరిగా కనిపించవు. అందుకోసమే దీనిపైకి ఎక్కేవారు తలపైన లైట్ పెట్టుకొని వెళతారు.
Authorization