ఘుమఘుమలాడే కాఫీ తాగడంలో అదో ఆనందం ఉంది. ఇప్పటికీ వేడివేడి కాఫీని ప్రేమించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నిజానికి కాఫీ పుట్టుపూర్వోత్తరాలే చాలా చిత్రంగా ఉంటాయి. ఇథియోపియా కొండ ప్రాంతాల్లో గొర్రెలుకాచుకునేవారు ఒకసారి గొర్రెలు అక్కడి విచిత్రమైన మొక్కల పండ్లు తిని గెంతులు వేయడం గమనించారట. అవి గుర్తించి వాటి పండ్లు తెచ్చి వారు తిని అందులో చిత్రమైన రుచిని ఆస్వాదించారు. దీనికే వారు కార్ధి అని పేరు పెట్టారు. ఇదే తర్వాతి కాలంలో ఈజిప్ట్, యెమన్ దేశాల్లో వ్యాప్తి చెందింది. 15వ శతాబ్దానికి అది దక్షిణాఫ్రికా, పర్షియా, టర్కీలకు చేరింది. 1585లో లియాన్ రావుల్స్ అనే జర్మన్ డాక్టర్ ఈ ద్రావకాన్ని నరాల బాధా నివారిణిగా వాడమన్నాడు. తర్వాత ఈ కాఫీ మరింతగా ఉత్తర ఆఫ్రికా, వెనిస్, ఈజిప్ట్, మధ్య ప్రాచ్య దేశాలకు వాణిజ్య వస్తువుగా మారింది. అలా ఈస్టిండియా కంపెనీ వల్ల కాఫీ ఇంగ్లండ్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో 1820లో వాణిజ్య పంటగా కాఫీతోటల పెంపకం ఆరంభమయింది. మనదేశంలో ఇపుడు కాఫీ పంటలో 98 శాతం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే పండుతోంది.