ఎమ్. విశ్వేశ్వరయ్య.. పూర్తిపేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇంజనీర్. 1861, సెప్టెంబర్ 15న కర్ణాటకలోని చిక్బల్లాపూర్జిల్లా, మద్దెన హళ్లిలో పుట్టారు. ఆయన పుట్టినరోజును ఇంజనీర్స్ డే గా జరుపుతారు. మనదేశ తొలితరం ప్రసిద్ధ ఇంజనీర్ ఆయన. మైసూర్లోని కృష్ణరాజ సాగర డ్యామ్కి చీఫ్ ఇంజనీర్ ఆయనే. అంతేకాదు హైదరాబాద్ వరదముప్పును తప్పించే ప్రణాళికను రూపుదిద్దారు. ఇలాంటి ఇంకెన్నో గొప్ప డిజైన్లకు ప్రాణం పోశారు విశ్వేశ్వరయ్య.
విశ్వేశ్వరయ్యకు పన్నెండేళ్లు ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు. చిక్బల్లాపూర్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. హైస్కూల్కి బెంగళూరుకు వచ్చారు. అక్కడి సెంట్రల్ కాలేజ్, మద్రాస్ యూనివర్సిటీల్లో కాలేజ్ విద్యను పూర్తి చేశారు. పుణెలోని కాలేజ్ ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత ముంబైలోని పబ్లిక్వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లకే ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ ఆయనను పిలవడంతో అక్కడ చేరారు. దక్కన్ పీఠభూమికి సాగునీరు అందే అద్భుతమైన డిజైన్ను ఇవ్వడమే కాక దానికి కార్యరూపమూ ఇచ్చారు. అలా ఎన్నో నిర్మాణాలకు కర్త, కర్మ, క్రియా అయిన విశ్వేశ్వరయ్య 1908లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లారు. మైసూర్కు దీవాన్గా నియమితులయ్యారు. 1955లో ప్రభుత్వం ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన 'భారతరత్న' బిరుదుతో సత్కరించింది. 101 ఏండ్లు బతికిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1962, ఏప్రిల్ 12న మృతిచెందారు.
Authorization