వార్తా పత్రికలను ప్రారంభించిన వ్యక్తి జూలియస్ సీజర్. తన రాజ్యంలో జరిగే సంగతులు తెలియడానికి ఫలకాలపై వార్తలు రాసి, ప్రజలకు అందుబాటులో ఉంచేవాడు. 8వ శతాబ్దం నాటికి చైనాలో చేతికాగితంపై వార్తలు రాసి పంచడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జాన్గూటెన్బర్గ్ 1447లో ముద్రణాయంత్రాన్ని కనుగొనడంతో వార్తా పత్రికల దశ తిరిగింది. బ్రిటన్ నుంచి వెలువడిన లండన్ గెజిట్ను మొట్టమొదటి వార్తాపత్రికగా పరిగణిస్తారు.