మనుషులకు చెమట పోయడం మనకు తెలుసు. కానీ మొక్కలు, చెట్లకు కూడా చెమట పోస్తుంది తెలుసా? అవును ఇది నిజం. అదేమిటో చూద్దామా? చెమట పోయడమంటే వాటిమీద మనలాగా నీటిబిందువులు రావు కానీ, అదొక ప్రక్రియ. దానినే ఆంగ్లంలో వేపరైజేషన్ అంటారు. సైన్స్ పరిభాషలో దీనిని బాష్పీభవనం అంటారు. మొక్క తన వేర్లతో మట్టి నుంచి నీరు లాగుతుంది. ఈ నీరు కాండం నుంచి ప్రయాణించి ఆకులకు చేరుతుంది. దాదాపు 90 శాతం నీరు ఆకులకు రోమరంధ్రాల్లాగా ఉండే పత్రరంధ్రాలా ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీన్నే వేపరైజేషన్ అంటారు. వేపరైజేషన్ వల్ల గాలిలో నీటిశాతం పెరుగుతుంది. ఇది చెట్లు, మొక్కలను చల్లబరచడానికి తోడ్పడుతుంది. నిజానికి మనుషుల్లో కూడా చెమట ఎందుకు పడుతుందంటే.. ఒంటిని చల్లబరచడంలో భాగంగా చర్మం తనకు తాను సహజసిద్ధంగా చేసుకునే ప్రతిక్రియే.