Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముకేశ్ అంబానీ వెల్లడి
ముంబయి : వచ్చే ఏడాది దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయని రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మెన్ ముకేశ్ అంబానీ తెలిపారు. బుధవారం జరిగిన 43వ కంపెనీ వార్షిక సమావేశంలో ముకేశ్ మాట్లాడుతూ సొంత పరిజ్ఞానంతో తమ కంపెనీ 5జీ సొల్యూషన్స్ను ఆవిష్కరించిందన్నారు. దేశంలో 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే దీని ప్రయోగాలను ప్రారంభిస్తామన్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఈ కొత్త 5జీ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నామన్నారు. గూగుల్ భాగస్వామ్యంతో అందుబాటు ధరల్లో 4జీ, 5జీ స్మార్ట్ఫోన్లను త్వరలోనే ఆవిష్కరించనున్నామన్నారు. ఇప్పటి వరకు 10 కోట్ల జియో ఫోన్లను విక్రయించామన్నారు. దేశంలో ఇప్పటికీ 2జీ ఫోన్లను వినియోగిస్తున్న 35కోట్ల మందికి స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు.