Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ప్రస్తుత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో భారత స్మార్ట్ఫోన్ ఎగుమతులు 48 శాతం మేర క్షీణించాయి. ముఖ్యంగా షావోమి, సామ్సంగ్ భారీ పతనాన్ని చవి చూశాయి. కెనాలిస్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో 48శాతం పతనంతో 1.73 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో 3.3 కోట్ల స్మార్ట్ఫోన్ ఎగుమతులు జరిగాయి. ఈ ప్రభావం టాప్10 బ్రాండ్లలో ఒకటైన ఆపిల్పై తక్కువగానూ, సామ్సంగ్ ఎక్కువగానూ ప్రభావితమైంది. లాక్డౌన్ సడలింపుల తరువాత డిమాండ్ స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, దేశీయ స్టార్ట్ఫోన్ మార్కెట్ ఇంకా ఒత్తిడిలోనే ఉందని కెనాలిస్ విశ్లేషకురాలు మధుమితా చౌదరి తెలిపారు.