Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేకరణకు చర్యలు తీసుకోవాలి :గూడూరు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోనా రోగులకు ఎంతో ఉపయోగకరమైన ప్లాస్మాను మొబైల్ వాహనాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి సూచించారు. గవర్నర్కు ఈ విషయాని చెప్పామని ఒక ప్రకటనలో గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోగులకు ప్లాస్మా ఎంతో బాగా పని చేస్తున్న గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్లాస్మా ద్వారా కోలుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఐసీఎంర్ ప్లాస్మా ఉపయోగించడానికి 52 సంస్థలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని ప్లాస్మా సేకరణకు మొబైల్ వాహనాల ద్వారా సేకరణకు పూనుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.