Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడవ దశ క్లీనికల్ ట్రయల్స్పై గ్లెన్మార్క్
ముంబయి : అంతర్జాతీయ ఔషధ పరిశోధనాధారిత కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ భారతదేశ వ్యాప్తంగా కరోనా రోగులలో చేసిన మూడవ దశ క్లీనికల్ ట్రయల్ యొక్క అత్యున్నత శ్రేణి ఫలితాలను వెల్లడించింది. ఏడు క్లీనికల్ ప్రాంగణాలలో మోస్తరు నుంచి మధ్యస్త లక్షణాలు కలిగిన 150 మంది రోగులలో లేబుల్ ర్యాండమైజ్డ్, మల్టీసెంటర్ క్లీనికల్ ట్రయల్ను చేసింది. పాజిటివ్గా గుర్తించబడిన రోగులకు ఫావిపిరావిర్తో 48 గంటల లోపల మోస్తరు నుంచి మధ్యస్త కోవిడ్19 లక్షణాలు కలిగిన రోగులకు సంబంధించిన ఫలితాలను సమీక్షించినట్టు తెలిపింది. విస్తృతశ్రేణిలోని ఓరల్ యాంటీవైరల్ ఔషధం ఫావిపిరావిర్ ఆర్ఎన్ఏ ఆధారిత ఆర్ఎన్ఏ పాలివిమెరాజ్ (ఆర్డీఆర్ఫీ) వైరల్ రెప్లికేషన్ దశను నిరోధిస్తుందని తమ క్లీనికల్ ట్రయల్స్లో తేలిందని పేర్కొంది. మధ్యస్థకాలంలోనే నియంత్రిత విభాగంతో పోల్చినప్పుడు గణనీయంగా వేడి, ఆక్సిజన్ శాచురేషన్, రెస్పిరేటరీ రేట్, దగ్గు వంటి లక్షణాలు ఫావిపిరావిర్ చికిత్సతో తగ్గించబడ్డాయని తెలిపింది.