Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ మార్ట్లో అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 9.9శాతం వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని సమాచారం. ప్లిప్కార్ట్-వాల్మార్ట్తో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెజాన్ సంస్థ రిలయన్స్ ఇండిస్టీస్ రిటైల్ వ్యాపార విభాగం కొంత వాటా కొనుగోలుకు ఆసక్తిగా కనబర్చుతుందని ఈటీ ఓ కథనంలో పేర్కొంది. గడిచిన మేలో వాల్మార్ట్, అమెజాన్ డాట్కామ్కు పోటీగా రిలయన్స్ జియోమార్ట్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజా చర్చలపై ఇరు కంపెనీలు స్పందించాల్సి ఉంది.