Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ ప్రపంచంలో అత్యంత విలువైన 50 కంపెనీలలో ఒకటిగా నిలిచింది. రిలయన్స్ షేర్లు 2.82 శాతం పెరిగి గరిష్ఠంగా రూ.2,060.65 ను తాకింది. దీంతో రిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13.54 లక్షల కోట్లకు చేరుకున్నది. డాలర్ పరంగా దాదాపుగా 173 బిలియన్ డాలర్లతో సమానం. దీంతో ప్రస్తుతం 171.9 బిలియన్ డాలర్లతో 50 వ స్థానంలో ఉన్న ఒరాకిల్ కార్పొరేషన్ను రిలయన్స్ వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది. జియో ప్లాట్ఫామ్లో వివిధ బహుళ జాతి కంపెనీల పెట్టుబడుల వరదతో గడిచిన నెల రోజుల్లో రిలయన్స్ షేర్లు 18.40 శాతంగా ర్యాలీగా ఉన్నాయి.