Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి ఎయిర్పోర్ట్ స్కామ్లో దర్యాప్తు
న్యూఢిల్లీ : ముం బయి విమానాశ్రయ అభివృద్ధిలో బోగస్ కాంట్రాక్టుల పేరుతో భారీ మోసానికి పాల్పడిన జీవీకే గ్రూపు ప్రమోటర్ల ఇండ్లల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. ఈ స్కామ్లో రూ.705 కోట్లమేర అవకత వకలకు పాల్ప డ్డారని ఆరోపణల నేపథ్యంలో జీవీకే గ్రూపు చైర్మెన్ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జివి సంజరు రెడ్డిలకు సంబంధించిన ముంబయి, హైదరాబాద్లోని ఇండ్లు, కార్యాలయాల్లో అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. ఈ నెల ప్రారంభంలో జీవీకే గ్రూపులోని పలు కంపెనీలతో పాటు కొంత మంది అధికారులపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, ముంబయిలోని తొమ్మిది ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. జూన్ 27న సీబీఐ కూడా జీవీ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. రెండు విచారణ సంస్థలు కూడా జీవీకే మనీలాండరింగ్పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.