Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టార్గెట్ ధర కుదింపు
- రెండు బ్రోకరేజీల షాక్
ముంబయి : గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లో దూసుకెళుతున్న రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, ఎడెల్ వెస్లు డౌన్గ్రేడ్ను ప్రకటిం చాయి. మార్చిలో కనిష్ట స్థాయి రూ.867.82 నుంచి రిలయన్స్ షేరు 150శాతం లాభపడి ఇటీవల రూ.2000 స్థాయిని చేరుకుంది. తాజాగా ఈ సూచీ టార్గెట్ ధరను కుదిస్తూ రెండు బ్రోకరేజీ సంస్థలు అనుహ్య ప్రకటన చేశాయి. నిధుల సమీకరణ, రుణాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాల వాల్యూ అన్లాక్ కావడంతో షేరు అధికంగా ర్యాలీ చేసిందనీ.. దీంతో విలువలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ పరిణామాలు అప్రమత్తతకు సంకేతాలని బ్రోకరేజ్ సంస్థలు విశ్లేషించాయి.
రిలయన్స్ షేరుకు ''హోల్డ్'' (నిలుపుదల) రేటింగ్ను కేటాయిస్తూ ఎడెల్వెస్ ప్రకటన చేసింది. షేర్ టార్గెట్ ధరను రూ.2105గా పేర్కొంది. రుణాలను తగ్గించుకోవడం, అసెట్ మానిటైజేషన్, వ్యాపారంలో డిజిటల్ మూమెంట్ తదితర అంశాలు షేర్ను రూ.2000స్థాయిని చేర్చేందుకు దోహదం చేశాయని పేర్కొంది. గతేడాది నుంచి నమోదవుతున్న పెరుగుదల... వాస్తవ విలువ కంటే అధికంగా ఉందని తెలిపింది. రిలయన్స్ షేరు రేటింగ్ను ''అవుట్ఫెర్ఫామ్'' నుంచి ''బై''కు కుదించినట్టు సీఎల్ఎస్ఏ తెలిపింది. కాగా టార్గెట్ ధరను మాత్రం రూ.2,250కి పెంచింది. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ధరకు అతి దగ్గరలో ఉంది. షేరు ర్యాలీ స్వల్పకాలంలో ఆగిపోతుందని అంచనా వేసింది. గత నాలుగేళ్లలో రిలయన్స్ సూచీ 400శాతానికి పైగా పెరిగింది. క్రితం 4నెలల్లో 150శాతం లాభపడింది. స్టాక్ ర్యాలీ కొంతకాలం పాటు ఆగిపోవచ్చనితాజాగా విశ్లేషించింది. మంగళవారం బీఎస్ఈలో రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ విలువ 1 శాతం పెరిగి రూ.2,177.45 వద్ద ముగిసింది.