Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా కాలంలోనూ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్కు లాభాల పంట పండింది. 2020 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 30.97 శాతం వృద్ధితో రూ.13,233 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.10,104 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం క్యూ1లో కంపెనీ నిర్వహణ ఆదాయం 43.8 శాతం తగ్గి రూ.91,238 కోట్లుగా నమోదైంది. కంపెనీ వ్యయాన్ని 42 శాతం తగ్గించుకుని రూ.87,406 కోట్లకు కుదించుకున్నట్టు వెల్లడించింది. జియో లాభాలు ఏడాదికేడాదితో పోల్చితే జూన్ త్రైమాసికంలో 182.82 శాతం ఎగిసి రూ.2,520 కోట్లకు చేరాయి. ఈ సంస్థ రెవెన్యూ 33.70 శాతం పెరిగి రూ.16,557 కోట్లుగా చోటు చేసుకుంది.