Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఏడాది జులైలోనూ వాహన అమ్మకాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. అన్లాక్లోనూ కరోనా ఉదృతి కొనసాగుతుండటంతో ట్రాక్టర్లు మినహా అన్ని రకాల వాహన విక్రయాలపై ప్రతికూలత కొనసాగుతుంది. కాగా ఈ ఏడాది మెరుగైన వర్షాలు ఉండొచ్చనే సంకేతాలతో ట్రాక్టర్ అమ్మకాలు కొంత ఆశజనకంగా నమోదయ్యాయి. గత జులైలో ద్విచక్ర, కార్లు, వాణిజ్య తదితర కంపెనీల అమ్మకాలు 71 శాతం వరకు పడిపోయాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి గడిచిన నెలలో 1.1 శాతం తగ్గుదలతో 1,08,064 యూనిట్లను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం అమ్మకాలు 25,678 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఇదే నెలలో 40,142 యూనిట్ల అమ్మకాలు చేసింది. అశోక్ లేలాండ్ అమ్మకాలు 56 శాతం క్షీణించి 4,775 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ కంపెనీ ట్రక్ అమ్మకాలు 70 శాతం, బస్ల విక్రయాలు 87 శాతం, తేలిక పాటి వాణిజ్య వాహన అమ్మకాలు 27 శాతం చొప్పున క్షీణించాయి. హ్యుందారు ఇండియా గత నెలలో 41,300 యూనిట్ల అమ్మకాలు చేసినట్లు ప్రకటించింది. జూన్ మాసం విక్రయాలతో పోల్చితే 54 శాతం అదనమని తెలిపింది.