Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దాదాపుగా 25 ఏళ్ల క్రితం నాటి 2జి టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని.. దానికి స్వప్తి చెప్పేందుకు విధానపరమైన చర్యలు తీసుకోవాలని రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మన్ ముకేష్ అంబానీ పేర్కొన్నారు. 5జి టెక్నాలజీలోకి అడుగుపెట్టే సమయంలోనూ 2జి ఫీచర్ ఫోన్లు ఉపయోగించడం ఏమిటనీ అన్నారు, ఇప్పటికీ దేశంలో 30 కోట్ల మంది మౌలిక ఇంటర్నెట్ సదుపాయం అందుకోలేకపోతున్నార న్నారు. ప్రజలను సాధికారం చేయడంలో మొబైల్ ఫోన్ ఎంత సమర్థవంతమైన సాధనమన్నారు. కాగా ఇప్పటికీ ఫీచర ఫోన్లను ఉపయోగిస్తున్న వారిలో గ్రామీణ ప్రాంత వాసులే ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ ఖాతాదారుల సంఖ్యనే ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖేష్ ప్రకటన చేశారని నిపుణులు భావిస్తున్నారు. 2జిని రద్దు చేయడం ద్వారా బిఎస్ఎన్ఎల్ను ఆ సంస్థ ఖాతాదారులను సొంతం చేసుకోవచ్చని ఈ బిలియనీర్ దృష్టి పెట్టి ఉంటారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.