Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ రజ్నీష్ కుమార్ పదవీ కాలాన్నీ పొడిగించే అవకాశాలున్నాయని సమాచారం. వచ్చే అక్టోబర్లో ఆయన పదవి విరమణ పొందనున్నారు. అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో రజ్నీష్ను మరి కొంత కాలం కొనసాగించనుందని తెలుస్తోంది. నూతన ఛైర్మన్ కోసం ఇప్పటికే ఎస్బిఐలోని ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లు దినేష్ కుమార్ ఖర, అర్జిత్ బసు, సిఎస్ శెట్టిలను ఇంటర్యూకు ఎంపిక చేశారు. ఆగస్టు 18-19 తేదిల్లో బ్యాంక్స్ బోర్డు బ్యూరో ఆన్లైన్లో ఇంటర్యూ చేపట్టనుందని సమాచారం. కరోనా వల్ల విత్త సిస్టమ్లో తీవ్ర సంక్షోభం నెలకొని ఉన్న నేపథ్యంలో రజ్నీష్ను మరింత కాలం కొనసాగించాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయని తెలుస్తోంది.