Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డిజిటల్ సర్వీసెస్ టెక్నలాజీ కంపెనీ జంప్ నెట్వర్క్స్ లిమిటెడ్ అధిక వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. భారత్లో బి2బి, బి2సి వ్యాపారాల ద్వారా 100 బిలియన్ డాలర్ల అవకాశాలపై దృషి పెట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 120 కోట్ల మొబైల్ వినియోగదారులున్నారని.. వచ్చే 2023 నాటికి గ్రామీణ ప్రాంత వాడకందారులు సగానికి పెరుగొచ్చని పేర్కొంది. ఇతర సంస్థలు అందించలేని స్ట్రీమింగ్, డిజిటల్ సర్వీసెస్, కంటెంట్ లాంటి సర్వీసులను రీజియన్ల వారిగా ఉపయోగించుకోనున్నామని పేర్కొంది.