Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక అవకతవకలకు సంబంధించి సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న జివికె పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మరో సవాల్ ఎదురైంది. ఆడిటింగ్లో కంపెనీ సహకరించడం లేదంటూ ప్రైస్ వాటర్హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. వివిధ అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ పలు మార్లు కోరినప్పటికీ కంపెనీ ఇవ్వక పోవడంతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అంశమై ఆడిటింగ్ సంస్థ ఆగస్టు 13న లేఖ ద్వారా రాజీనామా ప్రతిపాదన పంపినట్లు రెగ్యూలేటరీ సంస్థలకు జివికె సమాచారం ఇచ్చింది. జివికె ముంబయి ఎయిర్పోర్టు అభివృద్ధిలో బోగస్ కాంట్రాక్టు పనులు సష్టించి రూ.705 కోట్ల వరకు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.