Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఔషద ఉత్పత్తుల సంస్థ అకార్న్ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు బయెలాజికల్ ఇ (బిఇ) మేనేజింగ్ డైరెక్టర్ మహీమా దాట్లా వెల్లడించాయి. దీని స్వాధీనంతో కరోనా టీకాను మరింత వేగవంతంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు బిఇ డైరెక్టర్ నరేంద్ర దేవ్ మంతెన పేర్కొన్నారు. బయెలాజికల్ ఇ సంస్థ జాన్సన్ ఎండ్ జాన్సన్, జాన్సీన్ ఫార్మాలతో కలిసి పనిచేయడానికి ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉంది. అకొర్న్ ఇండియాకు హిమాచల్ ప్రదేశ్లో 39,000 చదరపు మీటర్లలో స్టెరిలైట్ ఇంజెక్టెబుల్ తయారీ ప్లాంట్ ఉంది. ప్రస్తుతం 1.35 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ 3 కోట్ల యూనిట్లకు విస్తరించుకునే అవకాశం ఉంది.