Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డాక్టర్ కాపర్ బ్రాండ్తో రాగి ఉత్పత్తుల తయా రీలో ఉన్న ఎంఎస్ఆర్ ఇండియా కొత్తగా తిరిగి ఉప యోగించు కోవడానికి వీలైన కాపర్ ఫిల్టర్డ్ ఎన్95 మాస్క్ను ఆవిష్క రించింది. అలాగే పేటెంటెడ్ కాపర్ కేర్ కీని అందుబాటులోకి తెచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే తొలిసారి స్వచ్ఛ మైన రాగితో ఎయిర్ మెష్ క్లాత్, మాయిశ్చర్ కంట్రోల్, యాంటీ బ్యాక్టీరియల్ ఫినిష్, కాపర్ ఫిల్టర్, ఎన్95 ఫిల్టర్, కాపర్ క్లాత్ ఫిల్టర్తో అయిదు లేయర్లతో ఈ మాస్క్ను రూపొందించినట్లు వెల్లడించింది. దైనందిన జీవితంలో తలుపులు, బటన్ల వంటివి నేరుగా ముట్టుకోకుండా కాపర్ కేర్ కీతో పనులు పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. కోవిడ్ 19 వంటి వైరస్లను చంపే గుణం రాగికి ఉంటుందని ఎంఎస్ఆర్ ఇండియా సిఇఒ డా. ఎం మల్లారెడ్డి తెలిపారు. దీని ధరను రూ.199గా నిర్ణయించామన్నారు. 2021 మార్చి నాటికి కోటి యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.