Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి 163.77 మిలియం డాలర్లు మాత్రమే వచ్చాయని సోమవారం ఆయన లోకసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. గత మూడేండ్లుగా వచ్చే ఎఫ్డీఐల్లో క్రమంగా తగ్గుదల చోటు చేసుకుంటుందన్నారు. 2017-18లో రూ. 350.22 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా.. ఆ తర్వాత ఏడాది 229 మిలియన్ డాలర్లకు తగ్గాయన్నారు. 2020లో ఇప్పటి వరకు భారత్ నుంచి చైనాకు 20.63 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పోగా.. ఇంతక్రితం ఏడాది 27.57 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెళ్లాయన్నారు.