Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలో నిషేధం విధించిన ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ మొత్తం లాభాల్లో భారత్ వాటా 1.2 శాతమేనని సెన్సార్ టవర్స్ అనే సంస్థ వెల్లడించింది. అయితే మొత్తం వినియోగదారుల్లో 24 శాతం భారత్లోని వారే. కానీ ఈ యాప్కు వచ్చే లాభాలు నామమాత్రంగా ఉన్నాయి. రాయల్ పాస్, రకరకాల రంగులు, ఇంకా యాప్లోని కొన్ని పరికరాలు కొనేందుకు మన దేశంలో ఉన్న పబ్జీ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల పెద్ద రెవెన్యూ రావడం లేదని సమాచారం.