Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అంతర్జాతీయ సరుకు రవాణ, కోరియర్ సేవలందించే డిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ తమ సేవల ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. 2021 జనవరి నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది. ప్రస్తుత ధరలతో పోల్చితే ఈ పెంపు 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. తమ వినియోగదారులకు నాణ్యత సేవలను అందించేందుకు సంస్థ కృషి చేస్తుందని డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ ఇండియా కంట్రీ మేనేజర్ ఆర్ఎస్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. తమ విమానయాన, గ్రౌండ్ నెట్వర్క్ ను నిర్మించుకునేందుకు, హబ్స్, కేంద్రాలను మెరుగుపరుచుకునేందుకు, డిజిటైజే షన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వార్షిక రేట్ల సవరణ వీలు కల్పించనుందన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు 220 పైగా దేశాలకు విస్తరించి ఉంది.