Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్పోయిన 40 లక్షల బీమా పాలసీలు: ఎల్ఐసి జిఎం వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభంతో దేశ వ్యాప్తంగా అమలు చేసిన లాక్డౌన్ వల్ల బీమా రంగంలోని కంపెనీలు దాదాపుగా 40 లక్షల బీమా పాలసీలను కోల్పోయాయని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వీటి విలువ దాదాపుగా రూ.45,000 కోట్లుగా ఉంటుందన్నారు. కరోనా కాలంలో బీమా పరిశ్రమ 40 లక్షల పాలసీలను కోల్పోగా.. ఇందులో రూ.15,000 కోట్ల విలువ చేసే నూతన వ్యాపార ప్రీమియంలు ఉన్నాయన్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని అత్యవసరాలకు ఉపయోగించుకున్నారన్నారు. దీంతో రూ.30,000 కోట్ల రెన్యూవల్ ప్రీమియంలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. సాధారణంగా మార్చి చివరి పక్షంలో పెద్ద మొత్తంలో పాలసీలు, ప్రీమియంలు నమోదువుతాయన్నారు. ఏడాది మొత్తం వ్యాపారంలో 15-18 శాతం ఈ కాలంలోనే జరుగుతుందన్నారు. మార్చి నుంచి వరుసగా నాలుగు మాసాల్లోనూ బీమా పరిశ్రమ వ్యాపారం ప్రతికూల వృద్థిని చవి చూస్తుందన్నారు.