Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్విఎల్)లో 1.28 శాతం ఈక్విటీ వాటా కోసం రూ.5,550 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కెకెఆర్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు పెరిగింది. కాగా ఈ నెల రోజుల వ్యవధిలో 3.03 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్ రిటైల్ రూ.13,050 కోట్లు సమీకరించింది. రిలయన్స్ ఇండిస్టీస్ అనుబంధ సంస్థల్లో కెకెఆర్ పెట్టు బడులు పెట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాదిలోనే ఆర్ఐఎల్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్ఫార్మ్స్లో కెకెఆర్ రూ.11,367 కోట్ల పెట్టుబడి పెట్టింది.