Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : టయోటా కిర్లోస్కర్ మోటార్స్ బుధవారం భారత మార్కెట్లోకి సరికొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. దీన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మసకజు యేషిమురా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ నవీన్ సోనీ, వైస్ ప్రెసిడెంట్ సేల్స్ తడాషీ అసాజుమా ఆవిష్కరించారు. ఈ ఎస్యువిలో ఎంటి వర్షన్ లీటర్కు 17.03 కిలోమీటర్లు, ఎటి వేరియంట్ 18.76 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఆ కంపెనీ తెలిపింది. 1.5 లీటర్ నాలుగు సిలెండర్ పెట్రోల్ ఇంజిన్తో దీన్ని తయారు చేసింది. యువ సాధకుల కోసం దీన్ని డిజైన్ చేశామని మసకజు తెలిపారు. త్వరలోనే మరిన్ని కొత్త మోడళ్లను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.