Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.194 తగ్గి రూ.50,449గా నమోదైంది. అంత ర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గడం, డాలర్ విలువ పడిపోవడంతో పసిడి ధర తగ్గుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇంతక్రితం సెషన్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,643గా పలికింది. కిలో వెండి ధర రూ.933 తగ్గి రూ.59,274గా నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1857 డాలర్లకు దిగివచ్చింది. ఔన్స్ వెండి ధర కూడా 22.70 డాలర్లకు చేరింది. గత నెల రోజుల్లో పసిడి ధర దాదాపుగా రూ.7వేల వరకు తగ్గినట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆగస్టు 7న రికార్డ్ స్థాయిలో పది గ్రాముల ధర రూ.56వేలు దాటిన విషయం తెలిసిందే.