Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీవీ యాడ్స్ ను మించిపోనున్నాయి: కేపీఎంజీ రిపోర్ట్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ ప్రకటనల విలువ టివి యాడ్స్ను మించి పోనున్నాయని సర్వీసెస్ నెట్వర్క్ కేపీఎంజీ ఓ రిపోర్ట్లో పేర్కొంది. టెలివిజన్ లాంటి సాంప్రదాయ మీడియా ప్రకటనలు 17 శాతం పడిపోయి రూ.21,700 కోట్లకు పరిమితం కానున్నాయని అంచనా వేసింది. ఇదే సమయంలో డిజిటల్ మీడియా ప్రకటనలు రూ.22,300 కోట్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా ప్రభావంతో జూన్తో ముగిసిన త్రైమాసికంలో టీవీ బ్రాడ్క్రాస్టర్స్ ఆదాయం గతేడాది ఇదే మూడు మాసాలతో పోల్చితే కేవలం 15-20 శాతం మాత్రమే వచ్చిందని తెలిపింది.