Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడవ ఎడిషన్ ను ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
హైదరాబాద్ : దేశంలోని మూడో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు... బ్యాంక్ ఆఫ్ బరోడా 'బరోడా కిసాన్ పఖ్వాడ' మూడో ఎడిషన్ను ప్రారంభించింది. ఇది అక్టోబర్ 1 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు. మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా, దేశాభివృద్ధికి అన్నదాతలు చేసిన కృషికి ప్రోత్సాహకంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు బ్యాంకు హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ పి శ్రీనివాస్ తెలిపారు. రైతులలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, మెరుగైన ఉత్పాదకత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన పద్ధతులను అవలంభించేలా వారిని ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ముఖ్యలక్ష్యం' అన్నారు. 'వివిధ పథకాల ద్వారా రైతాంగానికి సేవలందించటం, వ్యవసాయ రంగంలో లభించే అవకాశాలపై వారికి అవగాహన కల్పించడానికి బ్యాంక్ కృషిచేస్తున్నట్టు చెప్పారు. అంతేకాక.. ప్రభుత్వం, బ్యాంక్ అందించే సేవలతో రైతులు కనెక్టు అయ్యేలా ప్రోత్సహించడానికి పాన్-ఇండియా చొరవతో 'బరోడా కిసాన్ పఖ్వాడ' కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అక్టోబరు 1న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ప్రపంచ ఆహార దినోత్సవం రోజైన 16తో ముగియనున్నది. రైతులకు మెరుగైన ఆర్థిక సేవలను అందించడం ద్వారా దేశంలో ట్రాక్టర్ ఫైనాన్సింగ్ను పెంచడానికి బ్యాంక్ చొరవచూపుతున్నట్టు చెప్పారు. రైతుల ప్రయోజనం కోసం వర్చువల్ మోడ్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంపై ఈ ఏడాది దృష్టి సారించినట్టు తెలిపారు. 'బ్యాంక్ ఆఫ్ బరోడా 2018 నుంచి బరోడా కిసాన్ పఖ్వాడను నిర్వహిస్తున్నామన్నారు.