Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ వాహనతయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా శుక్రవారం మార్కెట్లోకి తన సెకండ్ జనరేషన్ సరికొత్త థార్ 2020 ఎస్యువిని విడుదల చేసింది. బిస్6 ప్రమాణాలతో థార్ ఎఎక్స్, ఎల్ఎక్స్ మోడళ్లలో పెట్రోల్, డీజిల్ వర్షన్లలో ఇది లభిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. ఎక్స్్ షోరూం వద్ద పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.9.8 లక్షల నుంచి రూ.13.75 లక్షలుగా, డీజిల్ వర్షన్లో రూ.9.8 లక్షల నుంచి రూ.12.95 లక్షలుగా ప్రకటించింది. పెట్రోల్ వేరియంట్లు 2 లీటర్ల ఇంజిన్తో 150 బిహెచ్పి శక్తిని కలిగి ఉంటాయని, డీజిల్ వేరియంట్లు 2.2 లీటర్ల ఇంజిన్తో 130 బిహెచ్పి శక్తితో అందుబాటలోకి తెచ్చినట్లు పేర్కొంది.