Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ సహా మరో ఐదు బ్యాంక్లను తమ జాబితా నుంచి తొలగించింది. ఈ ఆరు బ్యాంకులు ఇతర బ్యాంకులతో విలీనం కావడం వల్ల ఆర్బీఐ యాక్ట్ రెండో షెడ్యూల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇక ఆ బ్యాంకులు ఆర్బిఐ పరిధిలోకి రావు. ఈ జాబితాలో ఆంధ్రా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్లు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లు విలీనం అయిన విషయం తెలిసిందే.