Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారంపై భారం పడుతున్న సమయంలో ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తమ నాయకత్వ బృందాన్ని మరింత పటిష్ట పరిచే నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్కు చెందిన అంకిత్ గుప్తాను ఫ్రాంటియర్ అండ్ వర్క్స్పేసెస్ సిఇఒగా నియమించింది. గత సంవత్సరం ఓయోలో ఆయన ఫ్రాంటియర్ బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా చేరారు. తాజాగా ఆయనకు ఫ్రాంటియర్ అండ్ వర్క్స్పేసెస్ సారథి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. అంకిత్ గుప్తాతో పాటుగా భారతదేశపు సీనియర్ లీడర్షిప్కు చెందిన మరో ముగ్గురికి సైతం పదోన్నతిని కల్పించినట్లు ఓయో వెల్లడించింది.