Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీదారు బీఎండబ్ల్యూకు భారత మార్కెట్లోకి తన సరికొత్త మినీ కన్వర్టేబుల్ సైడ్వాక్ ఎడిషన్ను విడుదల చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దీని ఎక్స్షోరూం ధరను రూ.44.9 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిపింది. ఈ ఎడిషన్లో ప్రత్యేకంగా రూపొందించిన 15 కార్లను మాత్రమే విక్రయానికి ఉంచినట్లు పేర్కొంది. వీటిని షాప్.మిని.ఇన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు.