Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ రియల్మీ బుధవారం భారత మార్కెట్లోకి తన స్మార్ట్ ఎస్ఎల్ఇడి 4కె స్మార్ట్ టివిని విడుదల చేసింది. 55 అంగుళాల పరిమాణం, 100 వాట్ శబ్దంతో దీన్ని ఆవిష్కరించింది. దీని ధరను రూ.42,999గా నిర్ణయించింది. అక్టోబర్ 16న రియల్మీ, ఫ్లిప్కార్ట్ సైట్లలో ప్రీ బుకింగ్ను ప్రారంభిస్తున్నామని.. పండగ సేల్ ఆఫర్లో భాగంగా రూ.39,999కు అందించనున్నట్లు రియల్మీ తెలిపింది.