Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రయాణికుల వాహన అమ్మకాల్లో మెరుగైన వృద్థి నమోదైంది. గతేడాది ఇదే నెలతో పోల్చితే గడిచిన సెప్టెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 26.45 శాతం పెరిగి 2.72 లక్షల యూనిట్లకు చేరినట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియోమ్) శుక్రవారం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్లో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ గతేడాది ఇదే మాసం కంటే ఎక్కువ అమ్మకాలు జరగడం విశేషమని పేర్కొంది. ద్విచక్ర వాహన అమ్మకాలు 11.64 శాతం పెరిగి 8.49 లక్షల యూనిట్లకు చేరాయి. మూడు చక్రాల వాహనాలు రికార్డ్ స్థాయిలో 71.91 శాతం పడిపోయాయి.