Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలను నిలిపివేసిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను కాగితపు బిజినెస్ వ్యాపారి మురారి లాల్ జలన్ సొంతం చేసుకోనున్నారు. లండన్ కేంద్రంగా పని చేస్తున్న కల్రోక్ కాపిటల్, యూఏఈ వ్యాపారవేత్త అయిన మురారి లాల్ సంయుక్తంగా జెట్ కోసం సమర్పించిన పునరుద్ధరణ ప్రణాళికలకు రుణదాతల కన్సోరియం శనివారం ఆమోదం తెలిపింది. ఈ సంయుక్త భాగస్వామ్యంలో వచ్చే ఏడాది మధ్య నాటికి జెట్ ఎయిర్లైన్ తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇందుకోసం కొత్తగా రూ.1,000 కోట్ల నిధులను సమీకరించే అవకాశం ఉంది. జెట్ ఎయిర్వేస్ స్వాధీనానికి ఎన్సీఎల్టీ కూడా గ్రీన్ సిగల్ ఇవ్వాల్సి ఉంటుంది.