Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హెచ్ఎండి గ్లోబల్ కు చెందిన నోకియా మంగళవారం భారత మార్కెట్లోకి 4జీకి మద్దతు చేసే రెండు ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. నోకియా 225, 215 మోడళ్లను ఆవిష్కరించింది. కాగా నోకియా 215 ధరను రూ.2,949గా, నోకియా 225 ధరను రూ.3,499గా నిర్ణయించింది. ఈ ఫోన్లు అక్టోబర్ 23 నుంచి ఆన్లైన్లో లభ్యమవుతాయని ఆ కంపెనీ తెలిపింది. నవంబర్ 6 నుంచి రిటైల్ అవుట్లెట్లోనూ అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ రెండు ఫోన్లు కూడా 4జీ కనెక్టివిటీతో, అదనపు క్లియర్ కాల్ నాణ్యతను అందిస్తాయని తెలిపింది. సులభంగా సోషల్ మీడియాను బ్రౌజ్ చేసేందుకు, మల్టీ ప్లేయర్ గేమింగ్కు కూడా వీలు కల్పిస్తాయని పేర్కొంది.