Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 500 శాఖలకు విస్తరించినట్టు ప్రకటించింది. బెంగళూరు అమఅతహళ్లిలో నూతన శాఖను తెరవడం ద్వారా సరికొత్త మైలు రాయిని చేరుకున్నట్టు తెలిపింది. 2021 మార్చి నాటికి 600 శాఖలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. తమ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలు, ఆకర్షణీయమైన వడ్డీ ధరలతో ఫిక్స్డ్ డిపాజిట్లు, తాకట్టు రహిత రుణాలు, అందుబాటు ధరలో గఅహ రుణ పథకాల ద్వారా వినియోగదారులకూ సేవలను అందిస్తోందని తెలిపింది. దేశ వ్యాప్తంగా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 40 లక్షల పైచిలుకు వినియోగదారులకు, 15,000 ఉద్యోగులతో సేవలందిస్తున్నట్లు తెలిపింది. 500 బ్యాంకు శాఖలు, 100 అసెట్ సెంటర్లు/ఔట్లెట్లతో విస్తరించి ఉందని జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సిఇఒ అజరు కన్వాల్ పేర్కొన్నారు. ''కోవిడ్ కష్ట కాలంలోనూ మా బ్యాంకర్లు నూతన బ్యాంకు శాఖలను తెరిచేందుకు మాకు అవకాశాన్ని కల్పించారు. అన్ని నూతన శాఖలు డిజిటైజ్డ్ పరిసరాల్లో ఉన్నాయి. తక్కువ సదుపాయాలు కలిగిన వారికి మా ఉత్పత్తులు సేవలు అందిస్తాయని'' ఆయన తెలిపారు.