Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గఅహ రుణాలపై వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గిస్తు న్నట్టు ప్రకటించింది. ఖాతాదారుల ఆర్థిక పరపతి, సిబిల్ స్కోర్ ఆధారంగా రాయితీ కల్పించనున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. యోనో యాప్ ద్వారా రూ.75 లక్షలకు పైబడిన గఅహ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. కాగా పండుగ ఆఫర్లలో భాగంగా రూ 30 లక్షల నుంచి రూ 2 కోట్ల లోపు గఅహ రుణాలపై కస్టమర్ల క్రెడిట్ స్కోర్ ఆధారంగా 20 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి మరికొన్న రాయితీలు అందిస్తున్నట్టు పేర్కొంది.