Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్పై సైబర్ దాడి జరిగింది. తమ ఐటీ విభాగాలపై సైబర్ దాడి జరిగిందని గురువారం ఆ కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీంతో అన్ని డేటా సెంటర్ సేవలను వేరుచేసినట్టు పేర్కొంది. సైబర్ అటాక్ వల్ల భారత్ సహా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, రష్యాలోని ప్లాంట్లు ప్రభావితమైనాయని ఆ కంపెనీ తెలిపింది. భారతదేశంలో రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి 2-3 దశల మానవులపై పరీక్షల నిర్వహణకు డాక్టర్ రెడ్డీస్కు ఇటీవలే డీజీసీఐ అనుమతి లభించగా.. తాజా పరిణామం చోటుచేసుకోవడం పరిశ్రమ వర్గాల్లో ఆందోళన రేపింది. సైబర్ దాడిని గుర్తించిన నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ముకేశ్ రతి తెలిపారు. రాబోయే 24 గంటల్లో అన్ని కార్యకలాపాలు యథాస్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.