Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ2 లాభాల్లో 30శాతం పతనం
నవతెలంగాణ - బిజినెస్ బ్యూరో
ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్కు నూతన చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. నవంబర్ 2న ఆయన సీఎఫ్ఓగా చేరనున్నారని.. అయితే డిసెంబర్ 1 నుంచి బాధ్యతలను స్వీకరించనున్నారని ఆ కంపెనీ తెలిపింది. ప్రస్తుత సీఎఫ్ఓ, ప్రెసిడెంట్ సౌమెన్ చక్రవర్తి పదవీ విరమణ పొందనున్నారు. ఇప్పటికే ఆయన 19 ఏండ్లుగా పని చేస్తున్నారు. అగర్వాల్ ప్రస్తుతం లండన్ కేంద్రంగా పని చేస్తున్న రెకిట్ బెకిసెర్లొ సీఎఫ్ఓ గా పని చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో డాక్టర్ రెడ్డీస్ లాభాలు 30 శాతం తగ్గి రూ.762.3 కోట్లకు పరిమితమైనట్టు ఆ కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,092.5 కోట్ల నికర లాభాలు సాధించింది.