Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 600 పాయింట్లు ఫట్
ముంబయి : అంతర్జాతీయ, జాతీయ పరిణామాలతో బుధవారం భారత స్టాక్ మర్కెట్లు కుప్పకూలాయి. పలు యూరోపియన్ దేశాల్లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరగడంతో తిరిగి లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయనే సంకేతాలకు తోడు భారత జీడీపీ నెమ్మదిగా కోలుకుంటుందనీ.. అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సున్నా వృద్థి రేటు లేదా అంతకంటే మైనస్లోకి పడిపోవచ్చన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే తొలి నుంచి అమ్మకాల ఒత్తిడితో అన్ని రంగాల షేర్లు నేల చూపులు చూడటంతో బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోయి 39,922కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 160 పాయింట్ల పతనంతో 11,730 వద్ద ముగిసింది. నిఫ్టీలోని అన్ని రంగాలు నష్టాలను చవి చూశాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.76 శాతం, 0.93 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీలో ఇండుస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ అధిక నష్టాలను చవి చూసిన టాప్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, యూపీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ సూచీలు లాభపడిన వాటిలో టాప్లో ఉన్నాయి. రంగాల వారిగా బ్యాంకింగ్, లోహ సూచీలు 2 శాతం పైగా పతనం కాగా.. ఐటీ, ఫార్మా రంగాలు ఒక్క శాతం చొప్పున నష్టపోయాయి.