Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15వేల ఫిర్యాదులు
- ఎస్ఎఫ్ఐఓ సోదాలు
న్యూఢిల్లీ : సుబ్రతా రాయ్ కు చెందిన సహారా గ్రూపు ప్రజల నుంచి సమీకరించిన కోట్ల నగదును అక్రమంగా ఇతర కంపెనీలకు మళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో లక్కోలోని సహారా గ్రూపు కార్యాలయంలో గురువారం సీరియన్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (ఎస్ఎఫ్ఐఓ) అధికారులు సోదాలు చేశారు. సహారా గ్రూపు పలు విత్త స్కీముల్లో డిపాజిట్దారుల నుంచి సమీకరించిన నిధులను తన ఇతర సంబంధిత కంపెనీలకు అక్రమంగా బదిలీ, పెట్టుబడులు చేసినట్లు తేలిందని ఎస్ఎఫ్ఐఓ వెల్లడించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతులతో ఎస్ఎఫ్ఐఓ అనుమానిత కంపెనీల్లో సోదాలు చేస్తుంది. ఢిల్లీ బృందం గురువారం ఉదయమే లక్కో కార్యాలయంలో సోదాలు ప్రారంభించగా.. శుక్రవారం కూడా ఇవి కొనసాగనున్నాయని తెలుస్తోంది. తొమ్మిది సహారా కంపెనీలపై 15వేల ఫిర్యాదులు అందాయని ఓ విచారణ అధికారి తెలిపారు. డిపాజిట్దారులను మోసం చేసిన వాటిలో సహారా క్యూ షాప్ యూనిక్ ప్రొడక్ట్స్ రేంజీ, సహారా గోల్డ్ మార్ట్, సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తదితర కంపెనీలున్నాయి. 2009 నుంచి 2012 సమయంలో ఫుల్లీ కన్వర్టేబుల్ డిబెంచర్లు (ఓఎఫ్సీడీ) ద్వారా ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా భారీగా నిధులు సమీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. సహారా గ్రూపు ప్రజల నుంచి రూ.25,781 కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్న సెబీ ఆరోపణలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ కంపెనీ చైర్మెన్ సుబ్రతా రారు 2014లో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడిపిన విషయం తెలిసిందే. రెండేండ్ల తర్వాత 2016 మేలో ఆయన పెరోల్పై బయటికి వచ్చారు.